మరింత అభివృద్ధికై మరోసారి కాంగ్రెస్ ను ఆదరించండి : అనిరుద్ రెడ్డి

by Disha Web Desk 23 |
మరింత అభివృద్ధికై మరోసారి కాంగ్రెస్ ను ఆదరించండి :  అనిరుద్ రెడ్డి
X

దిశ,జడ్చర్ల : రాష్ట్రంలో అభివృద్ధి మరింత వేగంగా జరిగేందుకు పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనం పల్లి అనిరుద్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటలో మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే రాష్ట్రం తో పాటు నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి జరిగేందుకు ఆస్కారం ఉంటుందని ఎన్నికల కోడ్ ముగియగానే 6 గ్యారంటీ లోని మిగతా పథకాలు అమల్లోకి వస్తాయని అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు.

పాలమూరు ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు బహుమతిగా ఇద్దామని ప్రతి ఒక్కరు మహబూబ్నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పలువురు బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మీనాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిత్యానందం బుక్క వెంకటేశం ఆసిఫ్ ప్రీతం తుంగ రఘు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed