పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఉద్యోగులు వినియోగించుకోవాలి : కలెక్టర్

by Disha Web Desk 23 |
పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును  ఉద్యోగులు  వినియోగించుకోవాలి : కలెక్టర్
X

దిశ,నారాయణపేట ప్రతినిధి: ఈ నెల 8 వరకు నిర్వహించే పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఉద్యోగులు వినియోగించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎర్ర గుట్ట వద్ద గల సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రంలోని నారాయణపేట, మక్తల్ అసెంబ్లీ సెగ్మెంట్ ల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ రిజిస్ట్రేషన్, ఓటర్స్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్లను,ఓటింగ్ సరళిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ....పోలింగ్ సెంటర్ లోపలికి సెల్ ఫోన్ల ను అనుమతించరాదని అక్కడి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ ఆవరణలోని ఓ గదిలో ఏర్పాటు చేయనున్న పోస్టల్ బ్యాలెట్ ల స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించి స్ట్రాంగ్ రూమ్ బయట, లోపల సీసీ కెమెరాలను అమర్చాలని అక్కడి అధికారులను ఆదేశించారు.

Next Story

Most Viewed