- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నాకు కూడా రూ.100 కోట్లు ఇస్తే పార్టీ మారుతా.. బీజేపీ కార్పొరేటర్ షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ పలవురు నాయకులు పార్టీ మారడం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఎంతో మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరిన విషయం తెలిసిందే. కాగా ఈ క్రమంలోనే వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనికి స్పందిస్తూ ఎల్బీనగర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన మరి కొందరు బీజేపీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తుందని ఓ విలేకరి ఆయన్ను ప్రశ్నించారు. అందుకు చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగా మధు సూదన్ రెడ్డి స్పందించి.. తనకు కూడా వంద కోట్లు ఇస్తే పార్టీ మారుతానంటూ సమాధానం ఇచ్చారు. అయితే వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి వంద కోట్లు తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారా? అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.