కాంగ్రెస్ గ్యారంటీ బాండ్ బౌన్స్ అయింది.. హరీష్ రావు సెటైర్లు

by Disha Web Desk 4 |
కాంగ్రెస్ గ్యారంటీ బాండ్ బౌన్స్ అయింది.. హరీష్ రావు సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డిలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో శనివారం హరీష్ రావు మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆరుగ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని ఫైర్ అయ్యారు. ఆరింటిలో ఐదు అమలు చేశామన్నారు.. అంతా అబద్ధం అని కొట్టిపారేశారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. జనవరిలో ఆసరా పింఛన్లు ఇవ్వలేదని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు.

నిరుద్యోగ భృతి గురించి అసెంబ్లీలో భట్టి అబద్ధాలు చెప్పారన్నారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలు ఇస్తామని.. మోసం చేశారని తెలిపారు. కాంగ్రెస్ కు ఎందుకు ఓటేశామా అని జనం బాధ పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిందని సెటైర్లు వేశారు. బౌన్స్ అయినందుకు కాంగ్రెస్‌ను ఈ ఎన్నికల్లో శిక్షించాలని పిలుపునిచ్చారు. ఆరుగ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్నారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ పరువు తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు.

Read More..

‘రాష్ట్రం దివాలా తీసిందని ఏ ముఖ్యమంత్రైన చెప్తాడా?’: హరీష్ రావు సీరియస్

Next Story

Most Viewed