BREAKING: చేవెళ్ల పార్లమెంట్ బరిలో ప్రముఖ సినీనటి.. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు

by Disha Web Desk 1 |
BREAKING: చేవెళ్ల పార్లమెంట్ బరిలో ప్రముఖ సినీనటి.. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల పక్రియ ఊపందుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ప్రముఖ సినీనటి ‘పోలిమేర’ ఫేమ్ దాసరి సాహితి చెవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసింది. పలు వెబ్ సిరీస్‌, సినిమాలతో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న సాహితి రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శశాంకకు నామినేషన్‌ పత్రాలను అందజేసింది.



Next Story

Most Viewed