- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చేవెళ్ల ముఖ చిత్రాన్ని మార్చేది ఆయనే!.. బండ్ల గణేష్ అదిరిపోయే స్పీచ్
దిశ, డైనమిక్ బ్యూరో: రంజిత్ రెడ్డికి అవకాశం ఇస్తే పట్టు వదలని విక్రమార్కుడిలా సేవ చేస్తాడని, చేవెళ్ల ముఖ చిత్రాన్ని మార్చగలిగే సామర్ధ్యం తనకే ఉందని సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సమ్మేళనం సభకు హజరైన ఆయన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి రంజిత్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. రంజిత్ ఫోన్ వాడటం మొదలు పెట్టినప్పటి నుంచి ఒకటే నంబర్ వాడుతున్నాడని, చేవెళ్లలోని లక్షల మంది కార్యకర్తలు ఎప్పుడు ఫోన్ చేసిన ఎత్తుతాడని, ఎవరు ఫోన్ చేసినా ఒక్క రింగ్ కే ఎత్తే ఎంపీ ఈ భారతదేశంలోనే ఎవరూ ఉండరని, అది కేవలం రంజిత్ రెడ్డి మాత్రమేనని తెలిపారు.
చేవెళ్లలో ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే తెలంగాణలో చేవెళ్ల ముఖ చిత్రాన్ని మార్చి.. అద్భుతంగా తీర్చిదిద్దుతాడనంలో ఏ మాత్రం సందేహం లేదని స్పష్టం చేశారు. అలాగే రంజిత్ రెడ్డి నిస్వార్ధపరుడు, నిజాయితీపరుడు, నీతి మంతుడని చెబుతూ.. బీజేపీ వాళ్లు మాటిమాటికి జైశ్రీరామ్ అంటున్నారని, రంజిత్ రెడ్డి రాముడి లాంటివాడని, ఆయన సతీమణి, మా వదినమ్మ సీతమ్మ లాంటిదని అన్నారు. అలాగే మేము రాముని భక్తులమే, హనుమంతుడి భక్తులమే, ఫక్తు హిందువులమేనని పేర్కొన్నారు. అంతేగాక ముస్లింలను గౌరవిస్తాం, క్రిష్టియన్లను అభిమానిస్తాం, హిందువులను పోషిస్తామని, అన్నింటి కంటే భారతీయులమని సగర్వంగా చెప్పుకుంటామని బండ్ల గణేష్ తెలియజేశారు.