ఫైనల్స్‌లో గుజరాత్ టీమ్‌ను ఓడించి ఛాంపియన్స్‌గా నిలవాలి.. CM రేవంత్ రెడ్డి

by Disha Web Desk 3 |
ఫైనల్స్‌లో గుజరాత్ టీమ్‌ను ఓడించి ఛాంపియన్స్‌గా నిలవాలి.. CM రేవంత్ రెడ్డి
X

దిశ వెబ్ డెస్క్: అటు అసెంబ్లీ ఎన్నికలు ఇటు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. అధికార పక్షానికి, ప్రతిపక్షాలకు మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటోంది. ముఖ్యంగా జాతీయ పార్టీల నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే రిజర్వేషన్లను పెంచుతుందని ప్రజలకు హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్‌పై కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు.

కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కాగా రానున్న ఎన్నికలు గుజరాత్ వర్సెస్ తెలంగాణ మధ్య జరగబోతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు సెమీఫైనల్స్‌లో టిఆర్ఎస్‌ను ఓడించామని, ఇక రానున్న ఫైనల్స్‌లో బీజేపీని ఓడించి ఛాంపియన్షిప్ గెలవాలని పిలుపునిచ్చారు.

Read More..

ఖమ్మంలో సీఎం రేవంత్ కాన్వాయ్‌ తనిఖీ

Next Story

Most Viewed