బీజేపీ అభ్యర్థి ఇంట్లో రూ.4.8కోట్లు పట్టివేత.. కేసు నమోదు

by Dishanational6 |
బీజేపీ అభ్యర్థి ఇంట్లో రూ.4.8కోట్లు పట్టివేత.. కేసు నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో ఓ నివాసంలో భారీగా నగదు పట్టుబడింది. పోలింగ్ ప్రారంభానికి ముందు చిక్ బల్లాపూర్ లోక్ సభ నియోజకవర్గంలోని యలహంకలో రూ.4.8 కోట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్లైయింగ్ స్క్వాడ్ అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన బీజేపీ అభ్యర్థి కే.సుధాకర్ పై కేసు నమోదు చేశారు.

యలహంకలోని గోవిందప్ప అనే వ్యక్తికి చెందిన నివాసంలో అధికారులు జరిపిన సోదాల్లో నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇంటి ఓనర్ ను విచారించిన తర్వాతే.. బీజేపీ అభ్యర్థి కే. సుధాకర్ పై కేసు నమోదు చేశారు. దీంతో, ఆదాయపు పన్ను అధికారులు కూడా స్పాట్ కి చేరుకుని విచారణచేపట్టారు. ఇకపోతే, మదనాయకనహల్లి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ‘ఎక్స్‌’ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.



Next Story

Most Viewed