అనారోగ్యంతో బీజేపీ ఎంపీ కన్నుమూత

by Dishanational6 |
అనారోగ్యంతో బీజేపీ ఎంపీ కన్నుమూత
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్ హత్రాస్ బీజేపీ ఎంపీ రాజ్ వీర్ దిలేర్ అలీగఢ్ లోని ఆసుపత్రిలోమరణించారు. గత కొంతకాలంగా రాజ్ వీర దిలేర్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో హథ్రాస్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు. కాగా ఈసారి ఎన్నికల్లోనూ అదే స్థానానికి పోటీ చేస్తున్నారు రాజ్ వీర్ దిలేర్.

ఆయన మృతితో స్థానిక కార్యకర్తలు దిగ్భ్రాంతి గురయ్యారు. దిలేర్ 2017లో ఇగ్లాస్ నుంచి ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. తర్వాత లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దిలేర్ మృతికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాజ్ వీర్ దిలేర్ అకాల మరణం చాలా బాధాకరం అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. బీజేపీకి, ఆయన కుటుంబానికి దిలేర్ మృతి తీరని లోటని సానుభూతి వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed