- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘ఒకటి డ్రగ్స్, రెండు మర్డర్స్, మూడు నిరుద్యోగం.. ఇవే AP మూడు రాజధానులు’
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫైట్ పీక్ స్టేజ్కు చేరుకుంది. పోలింగ్కు మరో 6 రోజుల గడువు మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జగన్ సర్కార్ను గద్దె దింపడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ముందుకు సాగుతుండగా.. మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు సీఎం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్గా సాగుతోన్న వేళ సీఎం జగన్ సర్కార్పై మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుక చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం గాంధీభవన్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల వేళ ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారిన మూడు రాజధానుల ఇష్యూపై తనదైన రీతిలో సెటైర్లు వేశారు. చెప్పినట్లుగానే సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు ఏర్పాటు చేశారని.. అవి ఒకటి డ్రగ్స్, రెండు మర్డర్స్, మూడోది నిరుద్యోగమని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఏర్పాటు చేసిన మూడు రాజధానులు ఇవేనని సెటైర్ వేశారు. ఇంతకుమించి ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమి లేదని విమర్శించారు.