టీ20 వరల్డ్ కప్.. భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు

by Disha Web Desk 12 |
టీ20 వరల్డ్ కప్.. భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగే 2024 టీ20 వరల్డ్ కప్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. రోహిత్ కెప్టెన్‌గా హర్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా మొత్తం.. 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టును ప్రకటించగా.. మరో నలుగురు ప్లేయర్లను స్టాండ్ బై లో ఉంచారు. ఇదిలా ఉంటే 2022 డిసెంబర్ 31 రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్.. వన్డే వరల్డ్ కప్ కు దూరం అయ్యాడు. అలాగే ఫామ్ లేకపోవడంతో యూవ స్పిన్నర్ అయిన యుజువేంద్ర చాహల్ కు కూడా వన్డే వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కలేదు. కానీ.. 2024 ఐపీఎల్ లో ఈ ఇద్దరు ప్లేయర్లు మంచి ఫామ్ ను కొనసాగిస్తున్నారు. దీంతో ఈ రోజు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టుకు రిషబ్ పంత్, చహల్ స్థానం దక్కించుకున్నారు. దీంతో పంత్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగి పోయారు. కాగా టీ20 వరల్డ్ కప్ ఈ జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (WK), సంజు శాంసన్ (WK), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. సిరాజ్… రిజర్వ్‌లలో శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్‌లకు చోటు దక్కింది.

Next Story

Most Viewed