- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మాజీ ప్రియురాలి ఇంటికి బాంబును పార్సిల్ చేసిన ప్రియుడు.. ఇద్దరు మృతి
దిశ, వెబ్డెస్క్: తనను కాదని మరో పెళ్లి చేసుకుందనే కోపంతో ప్రియుడు తన మాజీ ప్రియురాలి ఇంటికి పార్సిల్ లో బాంబు పంపగా అది పేలి ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద, విచిత్ర సంఘటన గుజరాత్ లోని వడాలి లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జయంతి భాయ్ అనే వ్యక్తి ఓ యువతిని ప్రేమించాడు. కాని ఆమె అతన్ని కాదని.. జీతూ భాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా వారికి ముగ్గురు సంతానం అయ్యారు. తనని కాకుండా వేరే వ్యక్తిని తన ప్రియురాలు పెళ్లి చేసుకుందని కోపంతో ప్రియురాలు కుటుంబాన్ని హతమార్చాలని నిర్ణయం తీసుకొని ఓ ఆటో డ్రైవర్తో ఆమె ఇంటికి పార్సిల్ బాంబు పంపాడు. పార్సిల్ తీసుకున్న మాజీ ప్రియురాలి భర్త జీతూ భాయ్(32) దాన్ని తెరిచి చూడగా అందులో ఓ టేప్ రికార్డర్ ఉంది.
దాన్ని ఆన్ చేయగానే పేలడంతో జీతూ భాయ్ అక్కడికక్కడే మృతిచెందాడు. అతని ముగ్గురు కుమార్తెలకు గాయాలయ్యాయి. పేలుడు వల్ల గాయాలైన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా పెద్ద కుమార్తె భూమిక(12) దారిలోనే మృతి చెందగా.. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనకు కారణమైన ఆటోడ్రైవర్ను అదుపులోకి తీసుకోగా అసలు విషయం బయట పడింది. దీంతో నిందితుడు జయంతి భాయ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో.. జీతూ భాయ్ భార్య ఇంట్లో లేకపోవడంతో ఈ ఘటనలో ఆమె హస్తం కూడా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.