గొడ్డలితో దాడి.. వ్యక్తి మృతి

by Disha Web Desk 23 |
గొడ్డలితో దాడి.. వ్యక్తి మృతి
X

దిశ,లింగాల : క్షణికావేశంలో మేకల కాపరి గొడ్డలితో దాడి చేయగా ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల పరిధిలోని చెన్నంపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నంపల్లి గ్రామానికి చెందిన మల్లాజీ (38) తన అన్న మామిడి తోటకు వెళ్లగా పక్క పొలంలో ఉన్న మేకల కాపరి శివ శంకర్ తో వాగ్వాదం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకొని ఇంటికి తిరిగి వస్తున్న మల్లాజీపై మేకల కాపరి దాడి చేయడంతో మల్లాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. గత కొద్ది రోజులుగా మేకల కాపరి మల్లాజీ మధ్య గొడవలు జరుగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటన స్థలానికి సీఐ రవీందర్ ఎస్సై జగన్మోహన్ వెళ్లి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య మమత ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Next Story

Most Viewed