రాజన్న మాట, బాటగా నా బిడ్డ వస్తోంది: వైఎస్ విజయమ్మ

by  |
YS Vijayamma
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్సార్, షర్మిల ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమని, రాజన్న మాట, బాటగా తన బిడ్డ వస్తోందని షర్మిల తల్లి విజయమ్మ తెలిపారు. షర్మిల పట్టుబడితే విడవదని, గతంలో 3200 కిలోమీటర్లు నడిచిన మహిళగా రికార్డులకెక్కిందని, అది ఆమె పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎండలో, వానలో, చలిలో సైతం వెనుకడుగు వేయలేదన్నారు. మాటకు ప్రాణం ఇస్తుందని, రాజన్న రాజ్యం కోసమే ప్రజల్లోకి వస్తోందని ఆమె తెలిపారు. తన బిడ్డను ప్రజలకు అప్పగిస్తున్నానని, వైఎస్సార్ ను ఆశీర్వదించినట్లే షర్మిలను సైతం ఆశీర్వదించాలని విజయమ్మ కోరారు.

షర్మిల ఏదో ఒకరోజు ప్రభంజనాన్ని సృష్టిస్తుందన్నారు. వైఎస్సార్ కు తాము బంధువులమేనని, కానీ ప్రజలు ఆత్మ బంధువులని అన్నారు. అన్ని సమయాల్లో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామని విజయమ్మ భావోద్వేగమయ్యారు. వైఎస్సార్ లేని లోటు తనకైతే కట్టె కాలే వరకు ఎవరూ తీర్చలేరని, కానీ ప్రజలకు వైఎస్సార్ లేని లోటును షర్మిల ప్రజల బిడ్డగా తీరుస్తుందన్నారు.


Next Story

Most Viewed