ఆగ్రహం తెప్పిస్తే ప్రజలంతా కేసీఆర్ కాలర్ పట్టుకుంటారు: వైఎస్ షర్మిల ఫైర్

by  |
ఆగ్రహం తెప్పిస్తే ప్రజలంతా కేసీఆర్ కాలర్ పట్టుకుంటారు: వైఎస్ షర్మిల ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర సర్కార్ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఏం చేయాలో తెలియక రైతులు తగలబెట్టుతున్నారని, కొద్ది రోజులకు ఈ ఆగ్రహం మరింత ఎక్కువైతే రైతులు కేసీఆర్ కాలర్ పట్టుకొని నిలదీసే రోజు పక్కాగా వస్తుందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల ట్వీట్ చేశారు. వడ్లు కొన‌కుండా రైతు మీద సర్కారు పగబడుతుంటే, తరుగు పేరిట మిల్లర్లు దోచుకుంటుంటే ధాన్యం కొంటారో కొనరో తెలియక రైతు గుండె ఆగి చనిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎవడు చస్తే నాకేంటని సర్కారు చేతులెత్తేస్తే, ధాన్యం కొనకుండా కేసీఆర్ రాజకీయాలు చేస్తుంటే రైతులు తిరగబడే రోజొస్తుందని హెచ్చరించారు. పంట కొనాలని రైతులతో కాళ్ళు మొక్కించుకున్నా, పంటను కొనకుండా రైతులతో పంటను తగలబెట్టేలా చేసినా రైతులు కేసీఆర్ కాలర్ పట్టుడు పక్కా.. ఆయన అధికారానికి నిప్పు పెట్టడం పక్కా అని పేర్కొన్నారు.


Next Story

Most Viewed