రైతు నేస్తం అని చెప్పుకునేందుకు KCRకు సిగ్గుండాలి : షర్మిల ఫైర్

by  |
రైతు నేస్తం అని చెప్పుకునేందుకు KCRకు సిగ్గుండాలి : షర్మిల ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోని రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలకు సంబంధించి పేపర్ క్లిప్పింగ్స్‌ను జత చేసి ట్వీట్ చేశారు.

ట్వీట్ ప్రకారం..‘‘రైతుల ఇండ్లు బంగారు వాసాలు చేస్తానన్న దొర.. రైతులు అదే వాసాలకు ఉరివేసుకొంటుంటే ఆదుకోవడం చేతకాని దొరగారికి, రాజకీయ డ్రామాల కోసం ఉత్తరాది రైతులకు డబ్బులు ఇవ్వడానికి చేతనవుతుంది. ఇక్కడి నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకొంటుంటే .. నోటిఫికేషన్స్ ఇవ్వడం చేతకాని దొరకు తన కుటుంబానికి పదవులు ఇచ్చుకోవడానికి చేతనవుతుంది. రైతులు చస్తుంటే ఆదుకోవడం చేతకాని మీరు రైతు నేస్తం అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. విద్యార్థుల త్యాగాల మీద పదవులను అనుభవిస్తూ వారిని ఆత్మహత్యల బాట పట్టిస్తున్నందుకు మీ గుండెలు రాతి బండలు అయ్యుండాలి.’’ అని రాసుకొచ్చారు.



Next Story