మంత్రి కేటీఆర్ ఇలాకాలో షర్మిల.. ప్రజల భారీ మద్దతు

by  |
sharmila
X

దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల.. మంత్రి కేటీఆర్ ఇలాకాకు తరలివెళ్లారు. ప్రతీ మంగళవారం నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని గొల్లపల్లి గ్రామానికి ఆమె వెళ్ళారు.

ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడం లేదని నిరాశతో ఆత్మహత్యకు పాల్పడిన మహేందర్ యాదవ్ కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు. అనంతరం తన తండ్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి వారి సమక్షంలోనే నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు.


Next Story

Most Viewed