టీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలపై షర్మిల సెటైర్లు

by  |
టీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలపై షర్మిల సెటైర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్​ చేపట్టిన ధర్నా ఫలితంగానే కేంద్రం 3 కొత్త సాగు చట్టాలని రద్దు చేసిందని టీఆర్ఎస్​ నేతలు చెప్పుకోవడంపై వైఎస్సార్​టీపీ చీఫ్​ షర్మిల శనివారం ట్విట్టర్​ వేదికగా ఫైరయ్యారు. ముఖ్యమంత్రి కేవలం మూడు గంటలు ధర్నా చేసి.. రైతు చట్టాలను రద్దు చేపించామని జబ్బలు చరుచుకోవడం హాస్యాస్పదమన్నారు. టీఆర్ఎస్​ నేతలు అంత మొనగాళ్లైతే 6 గంటలు ధర్నా చేసి రైతుల వడ్లన్నీ కేంద్రం కొనేలా చేయాలని ఆమె డిమాండ్​ చేశారు. మంచి జరిగితే టీఆర్ఎస్ ఖాతాలో లేకుంటే ఇతరులపై బట్ట కాల్చి మీదేయడం టీఆర్ఎస్ ​నేతలకు అలవాటేగా అంటూ సెటైర్లు వేశారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల సమయంలో ఉత్తుత్తి హామీలు ఇచ్చినట్టు, ఉత్తుత్తి కొనుగోలు సెంటర్లను పెట్టి రైతులను మసిపూసి మారేడుకాయ చేయాలని, మోసం చేయాలని చూస్తే వదిలిపెట్టేది లేదని షర్మిల హెచ్చరించారు.

epaper – 1:00 PM TS EDITION (20-11-21) చదవండి



Next Story

Most Viewed