ఇష్టంలేని చదువు చదవలేక యువతి సూసైడ్

by  |
ఇష్టంలేని చదువు చదవలేక యువతి సూసైడ్
X

దిశ, నర్సింహులపేట: ఇష్టంలేని చదువు చదవలేక మనోవేదనకు గురై ఒక యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన చెన్న వైష్ణవి(17) చదువులో ఎప్పుడు ముందుండేది. పాలిటెక్నిక్ కోర్సుకు హైదరాబాద్ లో సీటు రాగా.. అంత దూరం పంపలేని తల్లిదండ్రులు స్థానికంగా గల మోడల్ స్కూల్లో జాయిన్ చేపించారు. పలుమార్లు తనకు పాలిటెక్నిక్ అంటే ఇష్టమని తల్లిదండ్రులకు చెప్పేది. తనకు ఇష్టంలేని చదువు చదవలేక మనోవేదనకు గురైన యువతి.. రోజూ మాదిరిగానే మంగళవారం స్కూల్ కు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లో ఫ్యాన కు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. తండ్రి సాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed