- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కాటారం : కాటారం మండలంలోని గారిపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిట్ట మహేష్కు కొడుకు భరత్(23), కూతురు ప్రతిభ(19) ఉన్నారు.
కుమారుడు భరత్ ఉపాధి కోసం కరీంనగర్లో నివసిస్తున్నారు. అయితే.. 3 నెలల క్రితం కరీంనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మృతి చెందారు. ఉన్న ఒక కూతురు ప్రతిభ కూడా మంగళవారం ఆత్మహత్య చేసుకుంది.
దీంతో కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. మూడు నెలల వ్యవధిలోనే ఇద్దరు సంతానం మృత్యువాత పడటంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాటారం సబ్ ఇన్స్పెక్టర్ లింగమూర్తి తెలిపారు. ప్రతిభ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
- Tags
- Karimnagar
Next Story