తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదం కొడుకు, ఉరి వేసుకుని కూతురు మృతి

by  |
తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదం కొడుకు, ఉరి వేసుకుని కూతురు మృతి
X

దిశ, కాటారం : కాటారం మండలంలోని గారిపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిట్ట మహేష్‌కు కొడుకు భరత్(23), కూతురు ప్రతిభ(19) ఉన్నారు.

కుమారుడు భరత్ ఉపాధి కోసం కరీంనగర్‌లో నివసిస్తున్నారు. అయితే.. 3 నెలల క్రితం కరీంనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మృతి చెందారు. ఉన్న ఒక కూతురు ప్రతిభ కూడా మంగళవారం ఆత్మహత్య చేసుకుంది.

దీంతో కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. మూడు నెలల వ్యవధిలోనే ఇద్దరు సంతానం మృత్యువాత పడటంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాటారం సబ్ ఇన్స్‌పెక్టర్ లింగమూర్తి తెలిపారు. ప్రతిభ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed