టీడీపీ అంటే తెలుగు తాలిబన్ పార్టీ.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by  |
టీడీపీ అంటే తెలుగు తాలిబన్ పార్టీ.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ తెలుగు తాలిబన్ పార్టీగా మారిందని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ఆరోపించారు. ఆ తాలిబన్ పార్టీకి చంద్రబాబు అధ్యక్షుడు అంటూ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన తాను అంబేద్కర్ గురించి.. సీఎం జగన్ గురించి చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు వక్రీకరించాయని ఆరోపించారు. ఈ సందర్భంగా తాను భారత రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేశానంటూ టీడీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేయడంపై మండిపడ్డారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని ప్రశ్నించిన చంద్రబాబుపై కేసు పెట్టాలా.? ఉరి తీయాలా.? అని ప్రశ్నించారు. గతంలో దళితుల్లో పుట్టాలని ఎవరు అనుకుంటారని చంద్రబాబు అన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు.

చంద్రబాబు విశ్వ బ్రాహ్మణుల తోకలు కట్‌చేస్తా అని వార్నింగ్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. అగ్నికుల క్షత్రియులను తరిమికొడతామన్నారు.. ఈ విషయాలను రాష్ట్ర ప్రజలు మరచిపోలేదని అన్నీ గుర్తుంచుకున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, మైనార్టీలు ఒకే కుటుంబంలా కలిసిమెలిసి జీవిస్తారన్నారు. అయితే అది ఓర్వలేక చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. బలహీన వర్గాలు అంబేద్కర్‌ను దేవుడిలా పూజిస్తున్నారని చెప్పుకొచ్చారు. 75 కార్పొరేషన్లల్లో అధికశాతం సీట్లు బలహీన వర్గాలకే ఇచ్చారని చెప్పుకొచ్చారు. తాను అంబేద్కర్ గురించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. విచ్చిన్న ఆలోచనలతో.. టీడీపీ నేతలు విషపూరిత ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బలహీన వర్గాలను జగన్ బలమైన వర్గంగా చేస్తున్నారని..సంక్షేమ పథకాలను టీడీపీ జీర్ణించుకోలేక పోతుందని జోగి రమేశ్ ఎద్దేవా చేశారు. పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నా కోర్టులకు వెళుతున్నారని.. బలహీన వర్గాలు అంబేద్కర్‌ను దేవుడిలా పూజిస్తాయి.. జగన్‌కు జేజేలు పలుకుతాయని సమావేశంలో జోగి రమేశ్ వ్యాఖ్యానించారు.


Next Story

Most Viewed