పట్టాభికి చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉంది.. వైసీపీ ఎమ్మెల్యే ఆరోపణలు

by  |
Chandhrababu--Dwarampudi-12
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌కు చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు. కాకినాడలోని డి కన్వెన్షన్‌లో మంగళవారం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ లబ్ధికోసం ఎంతకైనా తెగిస్తారని చెప్పుకొచ్చారు. రాజకీయ లబ్ధి కోసం పట్టాభి ప్రాణాలు తీసి, ఆ నేరాన్ని వైసీపీపై నెట్టి ప్రజల్లో సానుభూతి పొందాలనే కుట్రపూరిత తత్వం చంద్రబాబుదని ధ్వజమెత్తారు. ఈ విషయంలో పట్టాభి కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ద్వారంపూడి సూచించారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు పార్టీ మనుగడ కోసం ఎంతకైనా దిగజారుతారని విరుచుకుపడ్డారు. మరోవైపు చంద్రబాబు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరడంపై సెటైర్లు వేశారు. అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేయించిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని అపాయింట్మెంట్ కోరతారని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు.


Next Story