భారీ వర్షాల కారణంగా పాక్‌లో 550 మంది చిన్నారులు చనిపోయారు

by Disha Web Desk 12 |
భారీ వర్షాల కారణంగా పాక్‌లో 550 మంది చిన్నారులు చనిపోయారు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది భారీ వర్షాలు పాకిస్థాన్‌ను అతలకుతలం చేశాయి. ఓ పక్క భారీ వరదలు.. మరో పక్క ఆహార ధాన్యాల కొరత కారణంగా పాకిస్తాన్ ప్రజలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వరదల కారణంగా ఆ దేశంలో 550 మంది చిన్నారులు మృతి చెందారని పాకిస్థాన్ అధికారి గెరిడా బిరుకిలా తెలిపారు. భారీ వరదల కారణంగా పాకిస్తాన్ ప్రధాన నగరాల్లో 3.4 మిలియన్ల మంది చిన్నారులు నిరాశ్రయులయ్యారని ఆమె తెలిపారు. ఈ పరిస్థితుల నుంచి తమను గట్టెక్కించేందుకు.. "ప్రపంచం ఒక్కతాటిపైకి వచ్చి పాకిస్తాన్‌లోని పిల్లలకు సహాయం చేయాలి. మనం కలిసి ప్రాణాలు కాపాడగలం" అని ఆమె కోరారు.



Next Story