కెనడా, భారత్ మధ్య తీవ్ర స్థాయికి ఉద్రిక్తతలు

by Disha Web Desk 17 |
కెనడా, భారత్ మధ్య తీవ్ర స్థాయికి ఉద్రిక్తతలు
X

న్యూఢిల్లీ: కెనడా, భారత్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కెనడాలో ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ నేత హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందనే ఆరోపణలతో భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే కెనడాకు చెందిన దౌత్యవేత్త ఒలివర్ సిల్వెస్టర్‌ను భారత్ సైతం బహిష్కరించింది. భారత్‌లోని కెనడియన్ హైకమిషనర్ కామెరాన్ మాకేకు ఈ నిర్ణయాన్ని తెలియజేసిన విదేశాంగ మంత్రిత్వ శాఖ.. ఐదు రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.

భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తల జోక్యంతో పాటు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా బహిష్కరించినట్లు తెలిపింది. అంతకుముందు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. కెనడియన్ పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య విషయంలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని ఆరోపించారు.

ఈ క్రమంలోనే కెనడాలోని భారత ఇంటెలిజెన్స్ హెడ్ పవన్ కుమార్ రాయ్‌ను బహిష్కరిస్తున్నట్లు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. అయితే.. ఖలిస్తానీ నేత నిజ్జార్‌ను భారత్ 2020లోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. అతను 2007లో పంజాబ్‌లోని లూథియానాలో జరిగిన పేలుళ్ల కేసులో వాంటెడ్‌గా ఉన్నాడు.


Read More 2023 Telangana Legislative Assembly election News
For Latest Government Job Notifications
Follow us on Google News




Next Story