పవిత్ర పోప్ లియో XIVకు హృదయపూర్వక అభినందనలు: ప్రధాని మోడీ

by Mahesh |
పవిత్ర పోప్ లియో XIVకు హృదయపూర్వక అభినందనలు: ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: ఏప్రిల్‌ 21న క్యాథలిక్‌ క్రైస్తవుల మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 88 సంవత్సరాల వయస్సులో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కాగా ఆయన మరణం అనంతరం అమెరికాకు చెందిన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్ (Robert Francis Prevost) కొత్త పోప్‌గా ఎన్నికయ్యారు. ఆయనకు పోప్ లియో- XIVగా నామకరణం చేశారు. నూతన పోప్‌ను ఎన్నుకునేందుకు అత్యంత రహస్యంగా సిస్టిన్ చాపెల్‌లో సమావేశమైన 133 మంది కార్డినల్స్ పోప్‌ను నియమించారు. సంప్రదాయం ప్రకారం సిస్టీన్ చాపెల్ పైనుంచి తెల్లటి పొగ వెలువడటంతో, కార్డినల్స్ భేటీ అయిన రెండో రోజే నూతన పోప్ ఎన్నిక పూర్తయినట్టు ప్రకటించారు. దీంతో అమెరికా నుంచి పోప్ అయిన మొదటి వ్యక్తిగా రాబర్ట్ రికార్డు సృష్టించారు.

కాగా పోప్ లియో XIV గా ఎన్నికైన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్‌ (Robert Francis Prevost)కు భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని తన ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చారు. "భారత ప్రజల తరుఫున పవిత్ర పోప్ లియో XIV కు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శాంతి, సామరస్యం, సంఘీభావం, సేవ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడంలో కాథలిక్ చర్చికి ఆయన నాయకత్వం చాలా ప్రాముఖ్యత కలిగిన సమయంలో వస్తుంది. మన ఉమ్మడి విలువలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి హోలీ సీతో నిరంతర సంభాషణ భారతదేశం కట్టుబడి ఉంది." అని రాసుకొచ్చారు.



Next Story

Most Viewed