- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, రాజేంద్రనగర్: వివాహేతర సంబంధంతో మహిళ దారుణ హత్యకు గురైన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ లో జరిగింది. శంషాబాద్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్ర రెడ్డి నగర్ లో యాదమ్మ (35) టైలర్ పని చేసుకుంటూ జీవిస్తోంది. భర్తను వదిలి ఒంటరిగా నివసిస్తున్న ఆమెకు గతకొద్దికాలం క్రితం శంషాబాద్ మండలం నర్కూడ గ్రామానికి చెందిన నానవాళ్ళ కృష్ణ యాదవ్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. దీంతో వారిద్దరు గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు.
ఇక ఎప్పటిలానే యాదమ్మ ఇంటికి వచ్చిన కృష్ణ యాదవ్ గురువారం అర్ధరాత్రి గొడవపడి యాదమ్మను గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. అయితే వీరిద్దరి మధ్య గొడవకు కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు నానవాళ్ళ కృష్ణ యాదవ్ ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ప్రకాష్ రెడ్డి తెలిపారు.