బట్టలు ఆరేస్తూ మ‌హిళ మృతి.. ఎక్కడా?

by Sridhar Babu |
బట్టలు ఆరేస్తూ మ‌హిళ మృతి.. ఎక్కడా?
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: మృత్యువు ఏ రూపంలో వస్తదో తెలియదు. క్షణాల్లో మనుషుల ప్రాణాలను బలిగొంటది. తాజాగా ఖమ్మంలో చోటు ఘటన ఇందుకు ఉదాహరణగా నిలువనున్నది. ఊతికిన బట్టలు ఆరేస్తుండగా ఆ మహిళను మృత్యువు కబళించింది. దీంతో ఆ మహిళ మృతిచెందింది.

వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్ నగర్‌లో పాలకుర్తి తులసమ్మ(50)కరెంట్ షాక్‌తో బుధ‌వారం మృతి చెందింది. ఇంటి దగ్గర బట్టలు ఆరేస్తుండగా ఇనుప తీగ‌కు క‌రెంట్ స‌ర‌ఫ‌రా కావ‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతిచెందింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీమున్నీరవుతున్నారు.



Next Story

Most Viewed