చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

by  |
Accidentally dead
X

దిశ, వేములవాడ టౌన్: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ శివారులో చోటుచేసుకుంది. ఇన్స్‌పెక్టర్ వెంకటేశ్ వివరాల ప్రకారం.. వేములవాడ పట్టణంలోని ముదిరాజ్ కాలనీకి చెందిన బైరి కనకదరి(36) ఆదివారం ఉదయం చేపలు పట్టడానికి స్థానిక గంజివాగులోనికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు వాగులో చిక్కుకొని మృతిచెందాడు. కనకదరి అన్న భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్‌పెక్టర్ వెంకటేశ్ దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్స్‌పెక్టర్ మాట్లాడుతూ.. చేపలు పట్టడానికి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని, ఈతరాని మరియు అనుభవం లేకుండా వెళ్లి అనవసరంగా ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని సూచించారు. ముఖ్యంగా ఒంటరిగా చేపల వేటకు వెళ్లొద్దని, వాగు లోతు, అక్కడి పరిస్థితులు తెలియకుండా దిగొద్దని హెచ్చరించారు.


Next Story

Most Viewed