సంక్షేమ పథకాలే టీఆర్ఎస్‌ను గెలిపిస్తాయి

by  |
సంక్షేమ పథకాలే టీఆర్ఎస్‌ను గెలిపిస్తాయి
X

దిశ ప్రతినిధి ,హైదరాబాద్: రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వరంలో వేలాది కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపిస్తాయని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదర్శ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. దేశం మొత్తం గర్వపడే విధంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయని అన్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఒకవైపు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ మరో వైపు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళతామని తెలిపారు.


Next Story