పెళ్లి భోజనం చేయనివ్వలేదని.. వధూవరుల ఫొటోలు డిలీట్ చేసిన ఫొటోగ్రాఫర్

by  |
Photographer Deletes
X

దిశ, ఫీచర్స్: జీవితంలోని అత్యంత మధుర క్షణాల్లో వివాహం ఒకటి. అలాంటి ‘స్పెషల్ డే’ జ్ఞాపకాలను కలకాలం గుర్తుంచుకునే అవకాశం కల్పించేది పెళ్లి ఫొటోలే. అందుకే వధూవరులు మ్యారేజ్ ఫొటోస్ విషయంలో కేర్ తీసుకుంటారు. కానీ, ఇక్కడొక వరుడు మాత్రం ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌కు ఎక్కువ మనీ చెల్లించాల్సి వస్తుందని కుక్కల ఫొటోలు తీసే వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పగించాడు. ఆ వ్యక్తి ఫొటోలైతే తీసింది గానీ.. చివరకు భోజనం చేయనివ్వలేదనే ఫ్రస్టేషన్‌లో నూతన దంపతుల ముందే వాటిని డిలీట్ చేసి షాకిచ్చింది.

ఈ స్టోరీని రెడిట్‌లో పోస్ట్ చేసిన సదరు ఫొటోగ్రాఫర్.. తను ఒక డాగ్ గ్రూమర్ అని, కుక్కల ఫొటోలు తీసి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పేజీల్లో అప్‌లోడ్ చేస్తుంటానని తెలిపింది. మనీ సేవ్ చేసుకునేందుకు తన ఫ్రెండ్ పెళ్లి ఫొటోలు తీయమంటే పర్ఫెక్ట్‌గా తీయలేనని చెప్పినా, పర్వాలేదని నచ్చచెప్పడంతో ఒప్పుకున్నానని వెల్లడించింది. ఇక పెళ్లి రోజున అనేక లొకేషన్లలో వధూవరుల ఫొటోలతో పాటు వెడ్డింగ్, రిసెప్షన్ పిక్చర్స్‌ను ఉదయం 11 నుంచి రాత్రి 7.30 గంటల వరకు తీసినట్లు వివరించింది. అయితే సాయంత్రం 5 గంటలకు అన్నం కూడా తిననివ్వలేదని వాపోయింది. మ్యారేజ్ హాల్‌లో ఏసీ కూడా లేకపోవడంతో బాగా అలసిపోయానని చెప్పినా వినలేదని చెప్పింది. చివరకు 20 నిమిషాలు బ్రేక్ కావాల్సిందేనని పట్టుబట్టడంతో.. ‘వేరే ఫొటోగ్రాఫర్‌ను అరేంజ్ చెయ్ లేదంటే నీకు రావాల్సిన డబ్బులు వదిలేసి వెళ్లు’ అని వరుడు తెగేసి చెప్పాడంది. దీంతో కోపం తెచ్చుకున్న ఫొటోగ్రాఫర్.. అప్పటివరకు తీసిన ఫొటోలన్నింటినీ వాళ్ల ముందే డిలీట్ చేశానని తెలిపింది.

నిజానికి తనకు ఆ పెళ్లి ఫొటోల కోసం $ 250 చెల్లించాల్సి ఉండగా.. ఆ సమయంలో కేవలం ఒక గ్లాసు చల్లటి నీటి కోసం, ఎక్కడైనా ఐదు నిమిషాలు కూర్చునేందుకైనా ఆ మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పడం విశేషం.


Next Story

Most Viewed