నవరాత్రుల సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

నవరాత్రుల సమయంలో అమ్మవారి అనుగ్రహం కోసం చాలా మంది ఉపవాసం ఉంటారు.
ఉపవాసం ఉన్న సమయంలో ఆహారంలో కొన్నింటిని చేర్చుకోవడంవలన మన శరీరానికి కావలిసినంత శక్తి లభిస్తుందంట.. అవేంటో చూద్దాం.
నవరాత్రుల సమయంలో అల్పాహారంలో మిల్క్ షేక్ తీసుకోవడం మంచిదంట, అరటి, ఆపిల్ వంటి మిల్క్ షేక్ తాగడం వలన ఆరోగ్యం బాగుంటుందంట.
మధ్యాహ్న భోజనం టైమ్‌లో బచ్చలి కూర, టామాటో, బంగాళదుంపలను వేయించి తినాలంట, అలాగే రోటీలు కూడా బెటర్ అంట.
సాయంత్రం టీలో బెల్లం కలిపి తీసుకోవడం వలన శక్తి లభిస్తుందంట
రాత్రి డిన్నర్ సమయంలో పాలు, పన్నీర్ టిక్కా, చిలగడదుంప చాట్ తీసుకోవాలంట.