శీతాకాలంలో చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. దీనికి చాలా మంది ఎన్నో చిట్కాలను పాటిస్తుంటారు.
కానీ, రామఫలాలు తింటే ఎన్నో సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
రామఫలంలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండి చర్మంపై దురదను నివారిస్తాయి.
ఈ పండు గుజ్జులో ఒక స్పూన్ మెంతి పౌడర్ కలిపి జుట్టుకు రాసుకుంటే తలలో పేలు, చుండ్రు, దురద వంటివి తగ్గుతాయి.
ముఖంపై మెటిమలు ఉన్నవారు రెండు స్పూన్ల రామ ఫలం గుజ్జు, రెండు స్పూన్ల పాలు, ఒక స్పూన్ అలోవెర జెల్, అరటీస్పూన్ పసుపు మిక్స్ చేసి మెటిమలపై రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
రామఫలంలో ఉండే విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
కీళ్ల నొప్పులకు ఇది సరైన టిప్ ఈ పండును రోజూ తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.