ఇటీవల కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రోజు రాత్రి పాలలో కుంకుమ పువ్వు కలిపి తాగితే మంచి ఫలితాలుంటాయి.
కుంకుమ పువ్వులోని ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఇది సహజ యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తుంది.
రోజు ఈ పాలు తాగితే ఒత్తిడి తగ్గి, మానసిక సమస్యలు దూరం అవుతాయి. ఫలితంగా ప్రశాంతంగా నిద్రపొగలుతారు.
అంతేకాదు, ఈ పాలు తాగటం వల్ల మెదడుకు విశ్రాంతి లభించి చురుగ్గా పనిచేస్తుంది..
అలాగే ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.