భారత్‌లో ఎన్ని అందమైన అద్భుతమైన పర్యాటక ప్రాంతాలున్నాయి. అయితే అందులో కొన్ని ప్రాంతాలను పర్యాటకుల సందర్శనకు నిషేధించారు. అవేంటో చూద్దాం..

అక్సాయ్ చిన్: ఇది చైనా-భారత్ బోర్డర్ మధ్య ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా కూడా దీనిని పిలుస్తారు.
చంబల్ నది: మధ్యప్రదేశ్‌లోని చంబల్ నది అత్యంత సుందరమైన ప్రదేశాల్లో ఒకటి. బందిపోటు దొంగల కారణంగా ఇక్కడ పర్యాటకులను నిషేధించారు.
మానస్ నేషనల్ పార్క్: అస్సాంలోని అందమైన ఈ ప్రాంతాన్ని ఉగ్రవాదుల బెడద వెంటాడుతుంది.
తురా: మేఘాలయలో ఈ ప్రాంతం పర్యాటకంగా ఎంతో సుందరమైనది. అయితే ఈ ప్రాంతాన్ని ఉగ్ర బెడద కలవపెడుతుంది.
హాఫ్లంగ్: అస్సాంలోని ఉత్తర కచర్ పర్వతాల్లో ఉండే సుందరమైన ప్రాంతానికి టూరిస్టులను నిషేధించారు.
బస్తర్: ఛత్తీస్‌గడ్‌లోని ఈ ప్రాంతాన్ని ఇండియన్ నయాగరా అని పిలుస్తారు. అయితే ఈ ప్రాంతం రెడ్ కారిడార్‌లో ఉండటంతో పర్యాటకులను అనుమతించరు.
ఫుల్బని: ఒడిశాలోని సుందరమైన ఈ ప్రాంతం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఒకటి కావటంతో టూరిస్టులు ఇక్కడి వెళ్లని పరిస్థితి.