మనలో చాలా మంది మానసిక ప్రశాంతత కోసం గుడికి వెళ్తుంటారు..

ఇక దేవాలయాలకు వెళ్లిన ప్రతిసారి తప్పనిసరిగా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలని పెద్దలు చెబుతుంటారు.
కానీ, అసలు ప్రదక్షిణలు ఎందుకో చేయాలో మనలో చాలా మందికి తెలియదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రదక్షిణ విధానంలో భ్రమర కీటక న్యాయం, అయస్కాంత న్యాయం అని ఉన్నాయి.
తుమ్మెద శబ్దం చేస్తూ కీటకం చుట్టూ తిరుగుతూ ఉంటే క్రమంగా ఆ కీటకం కూడా దానికి భ్రమరమైపోతుంది. అదే భ్రమర కీటక న్యాయం.
అలాగే ఇనుప ముక్క మీద అయస్కాంతంతో ఒక క్రమపద్ధతిలో రుద్దితే ఆ ఇనుముకు అయస్కాంత శక్తి వస్తుంది.
ఇక ఆలయాలు నిర్మించే సమయంలో దేవుడి విగ్రహం కింద యంత్ర, మంత్ర శక్తిని అమర్చుతారు.
ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినప్పుడు ఆ శక్తి మనలోనూ ప్రవేశిస్తుంది.
ఫలితంగా మనకు మానసికంగా, శారీరకంగా ప్రశాంతత కలుగుతుంది.
ఇక ప్రదక్షిణలు ఒకటి నుంచి 3, 7, 9, 11, నూట ఎనిమిది వరకూ చేస్తుంటారు.