వేణు స్వామిని సీక్రెట్‌గా కలిసిన రష్మిక.. అసలు రహస్యం ఇదేనా?
అందాల ముద్దుగుమ్మ కన్నడ బ్యూటీ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ అమ్మడు ఛలో సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమై, తన నటనతో పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిపోయింది.
అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం చాలా ట్రోలింగ్స్ ఎదుర్కొంటుంది.
కన్నడలో బ్లాక్ బస్టర్ మూవీ కాంతారా సినిమాను నేను ఇంకా చూడలేదంటూ రష్మిక కామెంట్స్ చేయడంతో కన్నడ ప్రజలు నటిపై మండిపడుతున్నారు.
అంతే కాకుండా రిషబ్ షెట్టికి, రష్మికకు మధ్య గొడవలైనట్లు నెట్టింట్లో రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
అలాగే అన్ని భాషల లాగా నాకు కన్నడ మాట్లాడటం చాలా కష్టం అని చెప్పింది.
దీంతో మాతృ భాషకూడా రాదా అంటూ కన్నడ ఇండస్ట్రీ రష్మికను బ్యాన్ చేయాలని చూస్తుందంట.
ఈ సంఘటనలతో, ఈమధ్య జాతకం ఏమీ బాగాలేదని, సీక్రెట్‌గా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామిని కలిసినట్లు సమాచారం.