పెరుగుతో కలిపి ఈ ఆహార పదార్ధాలను అస్సలు తినకండి!

పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక చాలా మందికి పెరుగుతో ఏదైనా నంజ్జుకుని తినే అలవాటు ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను పెరుగుతో కలిపి అస్సలు తినకూడదని వైద్యులు చెబుతున్నారు.
పెరుగు అన్నంతో చేపలను అస్సలు తినకూడదు. ఇలా తినటం వల్ల చర్మ సమస్యలు, దద్దుర్లు, అలెర్జీ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.
పెరుగుతో కలిపి మామిడి ముక్కలు నారింజ, ద్రాక్ష, నిమ్మకాయ వంటి పుల్లని పండ్లు తినకూడదు. దీని వల్ల అజీర్తి, ఎసిడిటీ సమస్యలు వేధిస్తాయి. అలాగే పీహెచ్ లెవల్స్ ఇన్ బ్యాలెన్స్ అవుతాయి.
అలాగే పెరుగుతో ఉల్లిపాయ కూడా తినకూడదు. ఈ రెండింటినీ కలిపి తిన్నా అజీర్తి, గ్యాస్, అసిడిటీ సమస్యలు తలెత్తవచ్చు.
కూరగాయాల్లో వంకాయ, టమాటా, బంగాళదుంప వంటివి పెరుగుతో తినకూడదు. దీని వల్ల కూడా పొట్ట ఆరోగ్యం దెబ్బ తింటుంది. అజీర్తి, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
పెరుగుతో నూనెలో ఎక్కువ వేయించిన ఆహారా పదార్థాలను కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. దీని వల్ల జీర్ణక్రియ సమస్య ఏర్పడి రోజంతా కాళ్లు పట్టేసే అవకాశం ఉంది.
పెరుగులో పంచదార కలిపి తినటం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మందగిస్తుంది. శరీరంలో అలర్జీలు, వాపులు వంటి సమస్యలు వస్తాయి.