మహాశివరాత్రి రోజు శివుడికి వీటిని నైవేద్యంగా పెడితే.. మీ ఇంట సిరుల పంటే?

మహాశివరాత్రి రోజున భక్తులు ఎంతో నిష్టగా ఉపవాసం ఉండి శివపార్వతులకు పూజలు నిర్వహిస్తారు.
శివరాత్రి రోజున ఈ ప్రత్యేకమైన నైవేద్యాలను శివుడికి సమర్పిస్తే మీ కోరికలు నెరవేరడంతో పాటు ధనలాభం కలుగుతుందట.
శివుడికి నైవేద్యంగా పాయసం అన్నం పెడితే మీ జీవితంలోని ఆర్థిక సమస్యలు తీరుతాయి.
శివునికి 11 బిల్వ పత్రాలను నైవేద్యంగా పెడితే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ముఖ్యంగా ఈ ఆకులను కత్తిరించకుండా పెట్టాలి.
పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేస్తే మీ వైవాహిక జీవితంలో ఎక్కువ సమస్యలు తలెత్తవట.
మహాశివరాత్రి రోజున ఆవు లేదా ఎద్దుకు పచ్చి మేత తినిపిస్తే చాలా మేలు జరుగుతుంది.