టీని మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తాగితే ఈ సమస్యలు తప్పవట..!

ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో టెన్షన్ల వల్ల చాలా మంది టీ, లేదా కాఫీలు తాగకుండా ఉండలేరు.
రోజంతా యాక్టీవ్‌గా ఉండటానికి రోజుకు కనీసం 10 టీలు అయినా తాగుతారు.
ఒక్కసారి టీ తాగకున్నా ఏదోలా ఉంటుంది. దీంతో మిగిలిపోయిన టీని పదే పదే వేడి చేసుకుని తాగుతుంటారు.
అయితే అలా చేయడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
టీని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగడం వల్ల జీర్ణక్రియలో ఇబ్బందులు ఏర్పడి కడుపునొప్పి, క్యాన్సర్, బరువు పెరగడం, వాంతులు వంటివి వచ్చే అవకాశం ఎక్కువ.
అలాగే పొద్దున చేసిన టీని సాయంత్రం వేడి చేసి తాగితే కెఫిన్ కంటెంట్ పెరిగి గుండెల్లో మంట వస్తుందట.
ఇలా రోజు చేయడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గడంతో పాటు మలబద్దకం, కండరాల తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి.