నిలబడి నీళ్లు తాగుతున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే?

నీళ్లు మన శరీరాన్ని హైడ్రేట్ చేసి ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరం చేస్తుంది. ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడుతాయన్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే నిలబడి నీళ్లు తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
నిల్చొని నీళ్లు తాగడం వల్ల కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె, కీళ్లు, కిడ్నీలకు హాని కలిగే అవకాశాలు ఉన్నాయి.
ఇలా నీరు తాగడం వల్ల విటమిన్లు, పోషకాలు, జీర్ణవ్యవస్థకు చేరవు. దీంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.
మనం నిలబడి నీటిని తాగితే రక్తపోటు పెంచడంతో పాటు నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుంది.