గొంతు నొప్పి వేధిస్తుందా.. అయితే వీటితో ఉపశమనం పొందండి!!

చలికాలంలో ప్రజలు అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఇందులో ముఖ్యంగా గొంతు నొప్పి రావడం సర్వసాధారణం.
గొంతు నొప్పి వల్ల చికాకు, దురద, ఆహారాన్ని మింగడం, వంటి లక్షణాలు ఎక్కువగా ఉండి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.
గొంతు నొప్పి నుండి బయటపడేందుకు ఈ పదార్ధాలను ఉపయోగించి ఉమశమనం పొందవచ్చు.
గోరువచ్చని నీటిలో ఉప్పు, పసుపు, వేసి పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి నుండి రిలీఫ్‌ పొందవచ్చు.
తేనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా గోరువెచ్చని నీటిలో తేనే, నిమ్మరసం కలిపి తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది.
గోరువెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ వేసీ పుక్కిలిస్తే నొప్పితో పాటు ఇన్ఫెక్షన్లు కూడా దరి చేరవు.
పాలల్లో చిటికెడు పసుపు వేసి తాగితే గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు.
గొంతు నొప్పి ఎక్కువగా ఉంటే వేడిగా చికెన్ సూప్ చేసుకుని తాగాలి.
ఇన్ఫెక్షన్లు దరిచేరకూడదంటే అల్లంతో చేసిన టీ తాగడం మంచిది. ఈ టీ గొంతు నొప్పి తగ్గించడమే కాకుండా శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది.