వేసవిలో సబ్జా గింజలను ఇలా చేసి తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ప్రస్తుతం ఎండా కాలం ప్రారంభమయింది. ఈ క్రమంలో చిన్ని పెద్ద చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి. శీతల పానియాలను తాగితే శరీరాన్ని ఎండ నుంచి కాపాడుకోవచ్చు.
ఇందులో ముఖ్యంగా ఎక్కువ మంది రోజూ సబ్జా గింజలను తాగుతారు. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల మంచి ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
నీటిలో కొన్ని సబ్జా గింజలు వేసి అందులో నిమ్మరసం వేసి తాగితే వేడి చేయకుండా ఉంటుంది.
అలాగే ఉబ్బసం. కడుపు మంట, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు ఉంటే కచ్చితంగా సబ్జా గింజలను తాగాలి.
ఎండాకాలం చాలా మందికి తామర, సోరియాసిస్ వస్తుంది. అలాంటి వారు సబ్జా గింజలను పొడి చేసి అందులో కొబ్బరి నూనె వేసి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
నానబెట్టిన సబ్జా గింజలను గ్లాస్ పచ్చి పాలలో వేసుకుని తాగితే మధుమేహం తగ్గుతుంది.
మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు ఈ గింజలను నీటిలో వేసి ఉబ్బిన తర్వాత తాగితే తలనొప్పితో పాటు మానసిక ఒత్తిడి కూడా తగ్గి ప్రశాంతత లభిస్తుంది.