ఈ పానీయాలతో డెంగీని తరిమేయవచ్చని తెలుసా..?

శీతకాలం వాతావరణం చల్లగా మారటం వల్ల దోమలు ఇళ్లలోనే తిష్టవేస్తాయి. రాత్రి కాగానే విజృంభిస్తూ విపరీతంగా కుడతాయి. దాని వల్ల డెంగీ బారిన పడతారు.
అయితే డెంగీతో బాధపడేవారు జాగ్రత్తలు పాటించి ఈ పానీయాలు తాగితే ఆ జ్వరం నుంచి ఇట్టే బయటపడొచ్చు.
బొప్పాయి ఆకుల రసం: రెండు ఆకులను నలిసి రసం తీసి అందుతో నీళ్లు కలుపుకుని తాగాలి. ఇది రక్తంలోని ప్లేట్‌లెట్స్ పడిపోకుండా చేస్తాయి.
కాకరకాయ రసం: ఒక గ్లాస్ నీటిలో కాకర కాయ ముక్కలను ఉడికించి, వడకట్టి తాగాలి.
తులసి ఆకుల రసం: నీటిలో తులసి ఆకులు వేసి మరిగించి ఆ నీటిని తాగేయ్యాలి.
మెంతుల రసం: మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయం పొడి చేసుకుని ఒక గ్లాస్ నీటిలో కలుపుకుని తాగాలి. డెంగీ నుంచి ఉపశమనం పొందవచ్చు.