పెరుగుతో వీటిని కలిపి తింటే ఎంత ప్రమాదమో తెలుసా?

చాలా మందికి ఎంత మంచి కూరలు ఉన్నా కానీ భోజనం ఆఖరిలో పెరుగు  తినకుండా అస్సలు ఉండలేరు.
పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని అందరికీ తెలిసిన విషయమే.
అయితే కొన్ని పదార్థాలతో కలిపి పెరుగును తినకూడదు. అలా తింటే ప్రమాదంలో పడతారు.
పెరుగు, ఉల్లిపాయ కలిపి తింటే అలర్జీ, చర్మంపై దద్దుర్లు, తామర, సోరియాసిస్, గ్యాస్, వాంతులు వంటివి వచ్చే అవకాశం ఎక్కువ.
అలాగే మామిడి పండ్లు తినడం అంత మంచిది కాదు. దీని వల్ల జీర్ణక్రియలో మార్పులు ఏర్పడి పలు ఇబ్బందులు ఎదురవుతాయి.
పెరుగు అన్నంలో చేపల కూరను తినకూడదు. ఎందుకంటే కడుపు నొప్పి, కామెర్లు, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.