స్మార్ట్ వాచ్‌లు వాడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
సమాజంలో టెక్నాలజీ వాడకం రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. అన్ని శ్రమ లేకుండా స్మార్ట్ వర్క్ చేసే పరికరాలు వస్తున్నాయి.
ఇందులో జనాలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్‌కు ఎడిక్ట్ అయ్యారు. అలాగే ఇటీవల వచ్చిన స్మార్ట్ వాచ్‌లను చిన్నా పెద్ద ఉపయోగిస్తున్నారు.
అయితే స్మార్ట్ వాచ్ వాడేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని ఫ్లోరిడాలో చేసిన పరిశోధనలో షాకింగ్ విషయం బయటపడింది.
మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచ్‌ల వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్లి అనారోగ్య సమస్యలు వస్తాయట.
ఉదయం నుంచి నిత్యం ఉపయోగిస్తాం కాబట్టి వాటిపై పడిన దుమ్ము, ధూళి శరీరంలోకి పోయి హానికరం గా మారుతాయి.
సాల్మొనెల్లా, స్టాఫిలోకోకస్, సూడోమోనాస్ వంటి బ్యాక్టీరియాల వల్ల శరీరానికి హానీ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది.
ప్లాస్టిక్, రబ్బర్ వంటివి పెట్టుకోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి కాబట్టి మెటాలిక్ రిస్ట్ బ్యాండ్ ఉన్న వాచ్‌లను ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు ఫోన్, వాచ్‌పై పడిన దుమ్మును శుభ్రం చేయడం మంచిదని చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే అనారోగ్య సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని అంటున్నారు.