కాళ్ల పగుళ్లు బాధిస్తున్నాయా.. వీటితో చెక్ పెట్టండి?
చలికాలం స్టార్ అయింది కాబట్టి చలితో చాలా మందికి కాళ్ల పగుళ్లు బాధిస్తుంటాయి.
అయితే ఇంట్లో ఉండే పదార్థాలతో వాటిని ఇట్టే నయం చేసుకోవచ్చు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పండు గుజ్జు: ఈ గుజ్జును పగిలిన కాళ్లకు రాస్తే పగుళ్లు తగ్గడమే కాకుండా చర్మం మృదువుగా ఉంటుంది.
తేనె: ఇందులో నిమ్మరసం కలిపి పాదాలకు రాసుకుంటే పగుళ్లు తొందరగా తగ్గుతాయి.
వెన్న: పగిలిన పాదాలకు వెన్నతో మసాజ్ చేయడం ద్వారా పగుళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు.
కొబ్బరి నూనె: దీనిలో పసుపు కలిసి పగిలిన కాళ్లకు రాయాలి. ఇలా రోజు చేయడం వల్ల కాళ్ల వాపు, నొప్పి, పగుళ్లు తగ్గుతాయి.