కిడ్నాప్‌ చేసినరోజే హతమార్చారు : ఐజీ

by  |
కిడ్నాప్‌ చేసినరోజే హతమార్చారు : ఐజీ
X

దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజుల క్రితం మహబూబాబాద్‌లో కిడ్నాప్‌ అయిన తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్‌ను కిడ్నాపర్లు హతమార్చారు. మహబూబాబాద్‌కు 5 కిలోమీటర్ల దూరంలో ఓ గుట్టపై బాలుడి మృతదేహం గురువారం లభ్యం అయింది. తాజాగా దీనిపై వరంగల్ ఐజీ నాగిరెడ్డి స్పందిస్తూ.. దీక్షిత్‌ను అతికిరాతకంగా, కిడ్నాప్‌ చేసిన రెండు గంటలకే చంపారని తెలిపారు. చంపిన తర్వాతనే బాలుడి తల్లిదండ్రుల నుంచి రూ.45 లక్షలు డిమాండ్ చేశారని వెల్లడించారు.

యాప్ ద్వారా ఇంటర్నెట్ కాల్స్ చేసి, బాధితులను బెదిరింపులకు గురిచేశారని అన్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో మొత్తం నలుగురు నిందితులు ఇన్వాల్వ్ అయ్యారని స్పష్టం చేశారు. రూ.45 లక్షలు ఇచ్చేందుకు సిద్ధపడ్డా నిందితులు బాలుడిని హతమార్చారని తెలిపారు. కాగా కిడ్నాపర్ల కోసం నాలుగు రోజులుగా వందమంది పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని అన్నారు. దీక్షిత్‌కు మత్తు మందు టాబ్లెట్లు ఇచ్చి హతమార్చినట్టు పోలీసులు నిర్ధారించారు.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed