విరాట్ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీకి గుడ్ బై

by  |
విరాట్ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీకి గుడ్ బై
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అక్టోబర్‌లో దుబాయ్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో కోహ్లీ ఒక పోస్ట్ పెట్టాడు. ‘ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా టైమ్ పట్టింది. నాకు అత్యంత సన్నిహితులు, రవి భాయ్, రోహిత్ శర్మతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత టీమిండియా టీ20 ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చా. దీని గురించి బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషాతో పాటు సెలక్టర్లతో కూడా మాట్లాడా’ అని పేర్కొన్నాడు.

ఇండియన్ క్రికెట్, టీమ్‌కు తన శాయశక్తులా అండగా ఉంటానని కోహ్లీ తెలిపాడు. ఇప్పటివరకు కెప్టెన్‌గా ఉండటంలో తనకు సపోర్ట్ చేసిన టీమ్ సభ్యులు, సిబ్బందికి కోహ్లీ ధన్యవాదాలు చెప్పాడు. టీమ్ సభ్యులు, కోచ్ లు, సపోర్ట్ స్టాఫ్‌తో పాటు ప్రతి భారతీయుడు తన విజయానికి సపోర్ట్ చేశారన్నాడు. వర్క్ లోడ్ కారణంగానే కెప్టెన్సీకి గుడ్ బై చెబుతున్నానని కోహ్లీ తెలిపాడు.

https://twitter.com/imVkohli/status/1438478585518456832


Next Story

Most Viewed