విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం

by  |
విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం
X

దిశ, విశాఖపట్నం: ముంచింగిపుట్టు మండలం పనసపట్టు సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెదబయలు మండలం గుడుగుపల్లి గ్రామం నుంచి 20మంది భక్తులు ఒడిశాలోని కేందుగూగలో అమ్మవారి ఆలయానికి వెళ్తుండగా పనసపట్టు మలుపు వద్ద అదుపుతప్పి జీపు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 58ఏళ్ల కొర్ర సీతమ్మ ప్రాణాలు కోల్పోగా మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో లావణ్య అనే చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.


Next Story

Most Viewed