- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, స్టేషన్ ఘన్ పూర్: అధికార టీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్ష పదవి ఎన్నిక త్వరలో జరగనుండగా ఆ పదవి కోసం స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఎడవెల్లి విజయ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా గ్రామ, మండల స్థాయి ఎన్నికలు పూర్తి చేసుకున్న పార్టీ వర్గాలు జిల్లా అధ్యక్ష పదవి అనుబంధ సంఘాల ఎన్నిక త్వరలో చేపట్టనుంది. జిల్లా అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు పార్టీలో సీనియర్లు, జూనియర్లు తమ పలుకుబడిని ఉపయోగించుకుని జిల్లా అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రసన్నం చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాట, మాట ద్వారా ప్రజలను చైతన్యం కల్గించిన ఏడవెల్లి విజయ ఉమ్మడి వరంగల్తో పాటు 10 జిల్లాల్లో పల్లెప్రజల్లో చైతన్యం కలిగిస్తూ.. అనేక సంస్కృత కార్యక్రమాల ద్వారా రాష్ట్రం ఏర్పాటే ధ్యేయంగా ఉద్యమించిన గుర్తింపు ఉంది. దీనితో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి జనగామ జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.
- Tags
- Latest News